- Advertisement -
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం (సర్) ప్రక్రియలో భాగంగా కుటుంబ సభ్యులతో కలిసి ఎన్యూమరేషన్ ఫారంను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం హైదరాబాద్లో నింపారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటూ విలువైనదేననీ గడువు ముగిసేలోపు ఎన్యూమరేషన్ ఫారం నింపి, సంబంధిత అధికారులకు అందజేయాలని కోరారు. సర్ ఎన్యూమరేషన్ ప్రక్రియ చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో అర్హులైన వారి ఓట్లు పోకుండా బీఆర్ఎస్ నాయకులు, బూత్ లెవెల్ ఏజెంట్లు (బీఎల్ఏ)లు జాగ్రత్తపడాలనీ, ప్రజలకు సహాయపడాలని మరోసారి కోరారు.
- Advertisement -



