కేటీఆర్, కవిత సమావేశం ను విజయవంతం చేయాలి

నవతెలంగాణ – డిచ్ పల్లి
ఈనెల 5న డిచ్ పల్లి మండల కేంద్రంలోని జి కన్వెన్షన్లో జరిగే రూరల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి ముఖ్యఅతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామరావు, శాసనసమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత రానున్నారని, ఆర్టీసీ మాజీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఎంపీపీ బాదవత్ రమేష్ నాయక్, ఐడిసిఎంఎస్ చైర్మన్ సాంబార్ మోహన్,మండల బీఆర్ఎస్ అధ్యక్షులు చిలువేరి గంగదాస్ అన్నారు. శనివారం ఇందల్ వాయి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల  5న డిచ్ పల్లి కి రానున్నారని దానిలో భాగంగానే కేటీఆర్ ను ఇందల్ వాయి మండల కేంద్రంలోని టోల్ ప్లాజా నుండి భారీ ర్యాలీగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ విస్తృత సమావేశానికి పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు.వైస్ ఎంపీపీ భూసని అంజయ్య, సోసైటి చైర్మన్ చింతల పల్లి గోవర్ధన్ రెడ్డి, నిజామాబాద్ రూలర్ ఎస్సీ సెల్ కన్వీనర్ పాశం కుమార్, సినియర్ నాయకులు గడ్కోలు శ్రీనివాస్,కుంట నర్సారెడ్డి మోహన్ నాయక్, సంజీవరెడ్డి శ్రీనివాస్, బిరీష్ శేట్టి,పిండి గంగాధర్, రాకేష్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.
Spread the love