నూతనంగా ఎన్నికైన గ్రామ అభివృద్ధి కమిటీ పాలకవర్గానికి సన్మానం


నవతెలంగాణ కమ్మర్ పల్లి: మండలంలోని హాసకొత్తూర్ గ్రామంలో ఇటీవల నూతనంగా ఎన్నికైన గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు, కార్యవర్గ సభ్యులను మంగళవారం ఘనంగా సన్మానించారు. స్థానిక గ్రామ పంచాయితీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, పాలకవర్గ సభ్యులు నూతనంగా ఎన్నుకోబడిన గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామా సర్పంచ్ ఏనుగు పద్మ రాజేశ్వర్ మాట్లాడుతూ గ్రామా పంచాయతీ గ్రామ అభివృద్ధి కమిటీ కలిసి గ్రామా అభివృద్ధికి తోడ్పాటు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ ఏనుగు రాజేశ్వర్, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కొమ్ముల రజనీకాంత్, కార్యదర్శి కుందరం శ్రావణ్, కోశాధికారి నర్సయ్య, దనురాజ్, అంజయ్య, పంచాయితీ పాలకవర్గ సభ్యులు శ్రీహరి, రమేష్, నరేష్, తదితరులు పాల్గొన్నారు.

Spread the love