ఈ రోజు వలిగొండ మండలం లోని వెంకటాపురం గ్రామంలో గల శ్రీ మత్సగిరి లక్ష్మి నరసింహ స్వామి వారిని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్బంగా వారికి వేద పండితులు ఆలయంలోకి స్వాగతం పలికి ప్రత్యేక పూజ జరిపించి స్వామి వారి ఆశీర్వాదం అందజేసి తీర్థ ప్రసాదాలు అందించగా అక్కడ నుండి వారు ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.