గ‌తేడాది క‌రెంట్ షాక్‌ తో 69 మంది మృతి

నవతెలంగాణ – హైదరాబాద్
హైద‌రాబాద్ న‌గ‌రంలో క‌రెంట్ షాక్ ప్ర‌మాద ఘ‌ట‌న‌లు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో న‌గ‌రంలో ఏకంగా 69 మంది విద్యుదాఘాతంతో మృతి చెందార‌ని గ‌ణాంకాలు వెల్ల‌డిస్తున్నాయి. నగరంలోని 9 సర్కిళ్లు అయిన.. సికింద్రాబాద్-2, హైదరాబాద్ సౌత్, హైదరాబాద్ సెంట్రల్ కలిపి 7, హబ్సిగూడ 4, బంజారాహిల్స్ 4, సరూర్ నగర్ 12, సైబర్ సిటీలో 12, రాజేంద్రనగర్‌లో 13, మేడ్చల్‌లో 15 మందితో కలిపి 69 మంది విద్యుదాఘాతంతో మ‌ర‌ణించారు.
Spread the love