కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావు ను గెలిపించండి: పిట్టల సమ్మయ్య

నవతెలంగాణ – శంకరపట్నం
తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిదిన్నర సంవత్సరాలు అధికారంలో ఉన్న బిఆర్ఎస్, బీజేపీ పార్టీలు విద్యార్థి,నిరుద్యోగయువతను విస్మరించిందని, 2014,2018  ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయని బిఆర్ఎస్ పార్టీనీ, కెసిఆర్ నీ  ఓడించడానికి విద్యార్థి,నిరుద్యోగులు సిద్దం కావాలని, శంకరపట్నం మండల కేంద్రంలో బిఆర్ఎస్,బీజేపీ అభ్యర్థులను ఓడించి,కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావు నీ గెలిపించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) మండల కార్యదర్శి పిట్టల సమ్మయ్య పిలుపునిచ్చారు.  గురువారం శంకరపట్నం మండలంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావు ని గెలిపించాలని సీపీఐ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించుతూ,కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పిట్టల సమ్మయ్య మాట్లాడుతూ..ప్రజా పాలన చేస్తు ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటు పేదలకు అన్నదాతలకు అండగా ఉండేది కాంగ్రెస్ పార్టీ అని కరీంనగర్ జిల్లా లో కాంగ్రెస్ పార్టీ వస్తే అభివృద్ధి జరుగుతుందని విద్యార్థులకు, పేదలకు అన్నదాతలకు, మంచి పాలనా వస్తుందని అన్నారు. ప్రచారంలో ఏ ఎస్ ఎఫ్ ఐ కరీంనగర్ జిల్లా ఉపాధక్షలు కనకం సాగర్, మరియు, కన్నం సదానందం,తాడవేణి రవి, పిట్టల రామస్వామి, పిట్టల తిరుపతి, బోమ్మేటి వెంకటస్వామి, మేకల రవి, బొమ్మేటి పరమేష్, సంతోష్, అరవింద్,తదితరులు పాల్గొన్నారు.
Spread the love