సీపీఐ(ఎం) అభ్యర్థి యండీ. జహంగీర్ ని గెలిపించండి 

– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు భాస్కర్ పిలుపు
నవతెలంగాణ – భువనగిరి
భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే ప్రశ్నించే గొంతు పోరాడే నాయకుడు సీపీఐ(ఎం) అభ్యర్థి యండి.జహంగీర్ ను ఈ ఎన్నికల్లో గెలిపించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు భాస్కర్ పిలుపునిచ్చారు. గురువారం భువనగిరి మండల పరిధిలోని అనాజిపురం గ్రామంలో సీపీఐ(ఎం) గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఎండి. జహంగీర్ ను గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు.  ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న భాస్కర్ మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ మోడీ ప్రభుత్వం పది సంవత్సరాల పాలనలో దేశాన్ని అధోగతి పాలు చేసిందని దేశంలోని ప్రతి ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేటర్ శక్తులకు కారు చౌకగా అమ్మతు దేశ ఐక్యతను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. లౌకిక ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో కులము మతము మతోన్మాదము మనువాద సిద్ధాంతాన్ని ప్రోత్సహిస్తూ ప్రజల మధ్యన ఐక్యతను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. బీజేపీ పాలనలో సామాన్య మానవులు నిత్యవసర సరుకులను కొని తినే పరిస్థితుల్లో లేరని అన్ని రకాల నిత్యవసర వస్తువుల ధరలు పెంచడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. మరోవైపు దళితుల పైన మహిళల పైన గిరిజనుల పైన దాడులు దౌర్జన్యాలు హత్యలు అత్యాచారాలు పెరిగిపోయాయన్నారు. రాజ్యాంగంలో ఉన్న పౌరుల హక్కులను మొత్తం దెబ్బతీస్తున్న పరిస్థితి ఉన్నదని మరో మారు ఈ దేశంలో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజల బతుకుకు రాజ్యాంగానికి రక్షణ లేదని ఈ ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో వాగ్దానాలు చేసిన కాంగ్రెస్ వాటిని అమలు చేయడంలో విఫలమయిందని బిఆర్ఎస్ 10 సంవత్సరాల పాలల్లో ప్రజల సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. అందుకే ఈ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ ను ఓడించి సీపీఐ(ఎం) గెలిపించాలని ప్రజలను భాస్కరు కోరినారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పగిళ్ల ఆశయ్య , కొండమడుగు నర్సింహ్మ, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ్మ , సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు గునుగుంట్ల శ్రీనివాస్, గ్రామ శాఖ కార్యదర్శి అబ్దుల్లాపురం వెంకటేష్, సభ్యులు బొల్లెపల్లి స్వామి, బొల్లెపల్లి కిషన్, గంగనబోయిన బాల్ నర్సింహ్మ , గంగదార్ వెంకటేష్ పాల్గొన్నారు.
Spread the love