- Advertisement -
బైరి విశ్వనాథం, గడ్డం సిద్ధులు
నవతెలంగాణ-ఆలేరు రూరల్
ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామంలో బస్టాండ్ వద్ద పల్స్ పోలియో కార్యక్రమంలో సర్వాయి పాపన్న మోకు దెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైరి విశ్వనాథం గౌడ్, గడ్డం సిద్ధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐదేళ్ల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించండి, రెండు చుక్కల మందు చిన్నారుల భవిష్యత్తు భరోసానివ్వండి. పోలియో రహిత సమాజం నిర్మాణం కోసం కేంద్రాలకు వెళ్లి మీ పిల్లలకు తప్పకుండా పోలియో చుక్కలు వేయించాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మాటూరి నరసింహులు,మిరియాల స్వరూప, ఆకుల మాధవి,దొంగల రేణుక,తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



