- Advertisement -
డోంగ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ర్యాలీ
నవతెలంగాణ-మద్నూర్
జాతీయ డెంగ్యూ వ్యాధి దినోత్సవం పురస్కరించుకొని డోంగ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆస్పత్రి వైద్యురాలు శ్రీలేఖ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీ కార్యక్రమంలో నినాదాలు చేస్తూ చేయి చేయి కలుపుదాం డెంగు వ్యాధి నివారిద్దాం అంటూ భారీ నినాదాలు చేశారు. అనంతరం డాక్టర్ శ్రీలేఖ మాట్లాడుతూ.. డెంగు వ్యాధి నివారణ కోసం తీసుకోవలసిన జాగ్రత్తల గురించి, వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ ర్యాలీ కార్యక్రమంలో ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -



