Friday, June 5, 2026
E-PAPER
Homeజాతీయంజనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్

జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: జనసేన పార్టీకి కేటాయించిన రాజ్యసభ స్థానానికి అభ్యర్థిగా పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ పేరును పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అధికారికంగా ప్రకటించారు. శుక్రవారం సాయంత్రం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. లింగమనేని రమేష్ శనివారం మధ్యాహ్నం తన నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. రమేష్ 2015 నుంచి పవన్ కల్యాణ్‌తో, జనసేన పార్టీతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధికి సామాజిక వర్గాల మధ్య సఖ్యత, సోషల్ ఇంజినీరింగ్ అవసరమనే పవన్ ఆలోచనా విధానానికి ఆకర్షితులై ఆయనకు వెన్నుదన్నుగా నిలిచినట్లు పార్టీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -