Monday, August 10, 2026
E-PAPER
Homeదర్వాజమూడు పుస్తకాల ఆవిష్కరణ సభ

మూడు పుస్తకాల ఆవిష్కరణ సభ

- Advertisement -

తెలంగాణ భాషాసాంస్కృతిక శాఖ సౌజన్యంతో పాలపిట్ట, మయూఖ సంయుక్తాధ్వర్యంలో నెల్లుట్ల రమాదేవి, కొండపల్లి నీహారిణి రచించిన మూడు పుస్తకాల ఆవిష్కరణ సభ ఈ నెల 25 సాయంత్రం 6 గంటలకు రవీంద్రభారతి మినీహాల్ (మొదటి అంతస్తు), హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ సభలో డాక్టర్ ముదిగంటి సుజాతరెడ్డి, డి.కామేశ్వరి లకు సన్మానోత్సవం వుంటుంది. ఇందులో గుడిపాటి, డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, డాక్టర్.అమృతలత, శీలా సుభద్ర, సింగరాజు రమాదేవి, డాక్టర్ వాణీ దేవులపల్లి, అరుణ ధూళిపాళ, రాధిక సూరి, పద్మశ్రీ చెన్నోజ్వల పాల్గొంటారు. నెల్లుట్ల రమాదేవి రచించిన “డి. కామేశ్వరి కథలలో స్త్రీల సంవేదనలు”, కొండపల్లి నీహారిణి రచించిన “కథా సుజాతం” ముదిగంటి సుజాత రెడ్డి కథలు – సమగ్ర విశ్లేషణ పుస్తకం, కొండపల్లి నీహారిణి రచించిన “అభిమానం” – వివిధ పీఠికల సమాహారం పుస్తకాల పరిచయ కార్యక్రమం వుంటుంది.

‘మా నాన్నగారు` పుస్తకావిష్కరణ
మడత చంద్రమౌళి సాహితి సృజనాలయం, వరంగల్ వారు “మా నాన్నగారు (వ్యాసాంజలి)” గ్రంథం కోసం నిర్వహించిన జాతీయస్థాయి వ్యాసరచన పోటీలలో గెలుపొందినవారికి ఈ నెల 29న అంతర్జాలం వేదికగా జరగనున్న పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఈ బహుమతులు అందజేస్తారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -