ప్రేమోన్మాది ఘాతుకం.. బ్లేడుతో ప్రేయసి గొంతు కోసి

నవతెలంగాణ -విశాఖపట్టణం: పెళ్లికి నిరాకరించిందనే కోపంతో ప్రియురాలిపై బ్లేడ్ తో దాడి చేశాడు ప్రియుడు. ఈ ఘటన విశాఖపట్టణం చోటు చేసుకుంది.  59వ వార్డు నెహ్రునగర్ ప్రాంతంలో లలిత శ్రీ తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటుంది. ఆమె ఇంటికి సమీపాన నిందితుడు రామారావుఉంటున్నాడు. ఇరురువు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. రామారావు పనీపాటా లేకుండా జులాయిగా తిరగడం లలితకి నచ్చలేదు. అతని పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించింది. పెళ్లి చేసుకోవాలని గత కొద్ది రోజులుగా ఒత్తిడి తీసుకువస్తున్నా.. ఆమె ససేమిరా అంది. సోమవారం రాత్రి భోజనం చేసి ఆమె మేడపై వాకింగ్ చేస్తున్న ఆమె వద్దకు వెళ్లి పెండ్లి ప్రతిపాదన తీసుకొచ్చాడు. ఆమె నిరాకరించడంతో వెంట తీసుకొచ్చిన బ్లేడ్ తో దాడి చేస్తానని భయపెట్టాడు. అయినప్పటికీ ఆమె అంగీకరించకపోవడంతో బ్లేడ్ తో గొంతు భాగంలో దాడి చేశాడు. దీంతో ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు బంధువులు అక్కడికి చేరుకొని గాయపడిన లలిత శ్రీని ఆస్పత్రికి తరలించారు. పోలిసులకు సమచారం ఇవ్వడంతో దాడికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love