ఇంటర్ ఫలితాల్లో మాక్లూర్ కేజీబీవీ ప్రభంజనం

నవతెలంగాణ – మాక్లూర్
మండల కేంద్రంలో గల కాస్తురిభ గాంధీ బాలికల విద్యాలయంలో ఇంటర్ విద్యార్థినిలు బుదవారం విడుదలైన ఫలితాల్లో ప్రభంజనం సృష్టించారు. ఈ సందర్భంగా కేజీబివి ప్రత్యేకాధికారి సి ఎచ్ ప్రగతి మాట్లాడుతూ ఈ రోజు విడుదలైన ఇంటర్ ప్రథమ,  వ్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాల్లో కెజిబివి మాక్లూర్ కళాశాలకు చెందిన విద్యార్థులు ప్రథమ సంవత్సరం ఫలితాల్లో బైపిసి విభాగంలో అర్. స్పందన 423/440 మార్కు లతో ప్రథమ స్థానంలో నిలిచింది. యంపిసి విభాగంలో బి. వైష్ణవి 426 1470 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచింది. అలాగే రెండవ సంవత్సరం ఫలితాల్లో బైపీసి విభాగంలో బి. శ్రినిత్య 917/1000 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచింది. యంపసి విభాగంలో బి. నిహారిక 922/1000 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రథమ సంవత్సరంలో 56 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 43 మంది విద్యార్థులు 77 శాతంలో ఉత్తీర్ణతను సాధించారు. ద్వితీయ సంవత్సరంలో 60 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 56 మంది విద్యార్థులు 93 శాతంతో ఉత్తీర్ణతను సాధించారు. వీరిని కళాశాల ప్రత్యేక అధికారిణి సి ఎచ్. ప్రగతి, కళాశాల సబ్బంది అభినందించారు.
Spread the love