మహబూబ్‌ అలీ మృతి దురదృష్టకరం

– ఆవాజ్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నబి, రహీమ్‌
నవతెలంగాణ-ఇల్లందు
సహచరుడు, ఆడిట్‌ కమిటీ రాష్ట్ర కన్వినర్‌ కామ్రేడ్‌ మహబూబ్‌ అలీ మృతి దురదృష్టకరమని ఆవాజ్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నబి, రహీమ్‌ విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. తీవ్రమైన గుండెపోటుతో హఠాత్తుగా హైదరాబాద్‌లో కూకట్‌ పల్లి రెమెడీ హాస్పిటల్‌లో మృతిచెందడం విచారకరమన్నారు. ఆవాజ్‌ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ప్రగాఢ సంతాపాన్ని, వారి కుటుంభానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మహబూబ్‌ అలీ ఆవాజ్‌ ఇల్లందు డివిజన్‌ అధ్యక్షులుగా మైనారిటీల సమస్యలపై అనేక ఉద్యమాలలో పాల్గొని పనిచేశారని ఈ సందర్భంగా కొనియాడారు. సంతాపాన్ని ఆవాజ్‌ జిల్లా కార్యదర్శి, అధ్యక్షులు అబ్దుల్‌ నబి, రహీమ్‌, ఎండి జలాల్‌, ఖాదర్‌, అబ్బాస్‌, సుల్తానా, జైబున్నిసలు తెలిపారు.

Spread the love