హరితహరం పకడ్బందిగా నిర్వహించాలీ..

నవతెలంగాణ – జుక్కల్

హరితహరం, ఎస్ఎస్ జీని పకడ్బందిగా నిర్వహించాలని జుక్కల్ ఎంపీవో యాదగిరి అన్నారు. గురువారం నాడు మండలోని మండల పరిషత్ కార్యాలయంలో ముప్పై గ్రామా పంచాయతిల జేపిఎస్ లు, ఎఫ్ఏ లతో హరితహరం పైన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సంధర్భంగా సమావేశం లో ఏపీఓ సవిత మాట్లాడుతు హరితహరం, నర్సరిలలో ఉన్న మెుక్కలు ప్రతి ఖాళి స్థలాలలో నాటాలని, సంరక్షణ కూడా చేయాలని పేర్కోన్నారు. ఎంపివో యాదగిరి మాట్లాడుతూ గ్రామములో ఎస్ఎస్ జీ తో పాటు గ్రామల మౌళిక సదుపాయాల పైన ఎప్పడికప్పుడు స్పందించి గ్రామస్తులకు అందుబాటులో సమస్యలను పరిష్కరింప చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీవో, ఏపీవో, ఈసీ స్వామీదాస్, టీఏలు రమేష్, రవిందర్, ఆశోక్ గౌడ్, జేపిఎస్ లు, ఎఫ్ఏలు తదితరులు పాల్గోన్నారు.
Spread the love