కారు బైక్ ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

నవతెలంగాణ -శంకరపట్నం
కారు బైక్ ను ఢీకొట్టడంతో వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే శంకరపట్నం మండల పరిధిలోని  రాజాపూర్ గ్రామానికి చెందిన మాతాంగి నారాయణ (45) విద్యుత్ సంస్థలొ లైన్మెన్ గా విధులు నిర్వహిస్తున్నారు.బుధవారం  తన సొంత వాహనంపై రాజాపూర్ నుండి  కేశవపట్నం వెళుతుండగా కరీంనగర్ నుండి హుజురాబాద్ కు వస్తున్నటువంటి కారు మొలంగూర్ ఎక్స్ రోడ్ వద్ద బైకును ఢీకొట్టడంతో నారాయణకు రెండు కాళ్లు విరిగి రోడ్డుమీద పడడంతో స్థానికులు చూసి 108 కి ఫోన్ చేయడంతో  సిబ్బంది ఈఎంటి సతీష్ రెడ్డి, పైలెట్ కాజా ఖలీల్ ఉల్లాలు,లు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రున్ని ప్రథమ చికిత్స అందిస్తూ, హుజురాబాద్ ఏరియా హాస్పిటల్ కి తరలించినట్లు,సిబ్బంది తెలిపారు. ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది
Spread the love