కాంగ్రెస్ పార్టీ నాగోల్ డివిజన్ అధ్యక్షులుగా మంజులా రెడ్డి..

నవతెలంగాణ- నాగోల్
కాంగ్రెస్ పార్టీ నాగోల్ డివిజన్ అధ్యక్షులుగా మంజులా రెడ్డిని నియమించినట్లు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బి.మహేష్ కుమార్ ఉత్తర్వులు వెల్లడించారు. తనపై నమ్మకం ఉంచి నాకు డివిజన్ అధ్యక్ష పదవిని ఇవ్వడంతో డివిజన్లోని నాయకులు కార్యకర్తల, సహకారంతో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లి వారి ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వంతో పోరాడుతామని తెలిపారు. ఈ అవకాశం కల్పించిన  రాష్ట్ర నాయకత్వానికి, నియోజకవర్గ నాయకులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
Spread the love