నవతెలంగాణ-హైదరాబాద్ : ఐస్క్రీమ్ ఆర్డర్ చేస్తే అందులో మనిషి వేలు బయటపడిన భయానక అనుభవం.. ముంబయిలోని ఒక వైద్యుడికి ఎదురైంది. యువ డాక్టర్ ‘ఓర్లెమ్ బ్రెండన్’ తన సోదరితో కలిసి మూడు ఐస్క్రీమ్లను ఆర్డర్ పెట్టారు. వారు కొనుగోలు చేసిన కోన్ ఐస్క్రీమ్లను ఆ సంస్థ డెలివరీ చేసింది. దానిని తినడం మొదలు పెట్టిన ఆయనకు నాలుకకు ఏదో గట్టిగా తగిలింది. అనుమానం వచ్చి దానిని పరీక్షగా చూడగా అది 2 అంగుళాల మనిషి వేలు అని తేలింది. ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యినట్లు ఆ వైద్యుడు తెలిపారు. స్వయంగా డాక్టర్ కావడంతో అది మనిషి వేలేనన్న విషయాన్ని ధ్రువీకరించుకున్నారు. అనంతరం మలాడ్లోని పోలీస్స్టేషన్లో ఈ విషయంపై ఫిర్యాదు చేశాడు.