![](https://navatelangana.com/wp-content/uploads/2023/11/Screenshot_2023-11-08-11-52-21-73_6012fa4d4ddec268fc5c7112cbb265e72-300x209.jpg)
మండలంలోని శివాయిపల్లి గ్రామానికి చెందిన సుమారు 30 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బుధవారం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బిక్కాజి బల్వంతరావు సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై గంప గోవర్ధన్ అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినట్టుగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ విట్టల్ రెడ్డి, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు లింగం నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.