నవతెలంగాణ – హైదరాబాద్ : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారుల బదిలీల పర్వం కొనసాగుతున్నది. తాజాగా ప్రభుత్వం రాష్ట్రంలో 40 మంది మున్సిపల్ కమిషర్లను బదిలీ చేసింది. రేపటిలోగా ఆయా ప్రాంతాల్లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీచేసింది.అయితే, రాబోయే రోజుల్లో మరికొన్ని శాఖల్లోనూ అధికారుల బదిలీలు చేపట్టనున్నట్లు తెలుస్తున్నది.