మయాంక్‌ యాదవ్‌ ఔట్‌

మయాంక్‌ యాదవ్‌ ఔట్‌– గాయంతో ఐపీఎల్‌ 17కు దూరం
లక్నో : నయా పేస్‌ సంచలనం, లక్నో సూపర్‌జెయింట్స్‌ యువ పేసర్‌ మయాంక్‌ యాదవ్‌ ఐపీఎల్‌ 17వ సీజన్‌కు దూరం కానున్నాడు. కండరాల గాయంతో ఇబ్బంది పడుతున్న మయాంక్‌ యాదవ్‌ పూర్తి ఫిటెన్‌నెస్‌ సాధించకుండా ఇటీవల తుది జట్టులో నిలిచాడు. అయినా, గాయం తిరగబెట్టడంతో మైదానం వీడక తప్పలేదు. రాకెట్‌ స్పీడ్‌, వైవిధ్యంతో కూడిన బంతులేస్తున్న మయాంక్‌ యాదవ్‌ భారత జట్టు భవిష్య పేస్‌ స్టార్‌గా కితాబు అందుకుంటున్నాడు. కండరాల గాయం నుంచి కోలుకునేందుకు మయాంక్‌కు మూడు వారాల సమయం పట్టవచ్చు. లక్నో సూపర్‌జెయింట్స్‌ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తే.. అవసరాన్ని బట్టి మయాంక్‌ యాదవ్‌ జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆ జట్టు చీఫ్‌ కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ తెలిపారు.

Spread the love