– టీ20 వరల్డ్కప్ జట్టుపై గంగూలీ
కోల్కత : ఐసీసీ 2024 టీ20 ప్రపంచకప్లో పోటీపడే భారత జట్టుపై పదునైన విమర్శలు వినిపిస్తున్నాయి. ధనాధన్ ఫార్మాట్లో నాణ్యమైన ఫినిషర్ లేకుండా విజయం ఎలా సాధిస్తారనే ప్రశ్నలు వస్తున్నాయి. రింకూ సింగ్, కెఎల్ రాహుల్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్ వంటి ఆటగాళ్లకు అవకాశం దక్కకపోవటంతో మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ భారత జట్టుకు పూర్తి మద్దతుగా నిలిచాడు. ‘ జట్టులోని 15 మంది ఆటగాళ్లు మ్యాచ్ విన్నర్లు.