మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షున్ని పరామర్శించిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు 

నవతెలంగాణ – రామగిరి
రామగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రొడ్డ బాపన్న తల్లి రొడ్డ లక్ష్మి లద్మాపూర్ గ్రామ మాజి సర్పంచ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా రోడ్డ బాపన్నను మంథని ఎమ్మెల్యే రాష్ట్ర ఐటీ అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు  మృతురాలు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబానిక తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన వెంట మండల ఎంపీపీ ఆరెల్లి దేవక్క కొమురయ్య గౌడ్, ముస్త్యాల మాజీ సర్పంచ్ రామగిరి లావణ్య నాగరాజు, నాయకులు ముస్త్యాల శ్రీనివాస్, కోర కొప్పుల తులసీరామ్ గౌడ్, అట్టె తిరుపతిరెడ్డి,  తదితరులు ఉన్నారు.
Spread the love