నేడు కరీంనగర్‌ కేబుల్‌ బ్రిడ్జి ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్‌

నవతెలంగాణ-హైదరాబాద్ : అధునాతన రోడ్లు, నలువైపులా అద్భుతమైన సెంట్రల్‌ లైటింగ్‌ తదితర హంగులతో అభివృద్ధిలో దూసుకెళ్తున్న కరీంనగర్‌ సిగలో మరో మణిహారం చేరుతున్నది. మానేరు నదిపై రూ.224 కోట్లతో విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన తీగల వంతెనను మంత్రి కేటీఆర్‌ బుధవారం ప్రారంభించనున్నారు. ఈ బ్రిడ్జిపై దేశంలోనే తొలిసారిగా డైనమిక్‌ లైటింగ్‌ ఏర్పాటు చేస్తుండటం విశేషం. హైదరాబాద్‌లోని దుర్గం చెరువు తర్వాత రాష్ట్రంలో నిర్మించిన రెండో కేబుల్‌ బ్రిడ్జి ఇది. మానేరు నదిపై కరీంనగర్‌ నుంచి సదాశివపల్లి మీదుగా వరంగల్‌ ప్రధాన రోడ్డుకు కలిసేలా దీనిని నిర్మించారు.

Spread the love