వారంలో రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం: మంత్రి

నవతెలంగాణ-హైదరాబాద్ : కాంగ్రెస్ రైతు పక్షపాత పార్టీ అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. వారం రోజుల్లోనే రుణమాఫీ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. రూ.2లక్షలను ఏకకాలంలో మాఫీ చేస్తామన్నారు. దీనివల్ల ప్రభుత్వంపై రూ.32వేల కోట్ల భారం పడుతుందని చెప్పారు. కాగా నల్లగొండ డీసీసీబీ ఛైర్మన్‌గా కుంభం శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ప్రమాణస్వీకార కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.

Spread the love