నవతెలంగాణ – హైదరాబాద్ : మెదక్ లో జంతు వధకు సంబంధించి అల్లర్లు జరిగిన సంగతి తెలిసిందే. దుకాణాలు, వాహనాలు ధ్వంసం అయ్యాయి. రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో రాజ్ అరుణ్ అనే యువకుడు కత్తిపోట్లకు గురయ్యాడు. నార్సింగ్ అనే యువకుడు రాళ్ల దాడిలో గాయపడ్డాడు. ఈ నేపథ్యంలో, మెదక్ వెళ్లేందుకు ముంబయి నుంచి హైదరాబాద్ వచ్చిన గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ను పోలీసులు ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేశారు. తాను మెదక్ వెళతానని రాజా సింగ్ ముందుగానే ప్రకటించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.