- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
లండన్, దావూస్ పర్యటనను విజయవంతంగా ముగించుకుని హైదరాబాద్కు తిరిగి వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత రావు మర్యాదపూర్వకంగా కలిసి, శుభాకాంక్షలు తెలిపారు. విదేశీ పెట్టుబడుల ఆకర్షణ, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు అధ్యయనం తదితర అంశాల్లో పర్యటన విజయవంతమైన సందర్భంగా ముఖ్యమంత్రిని పుష్పగుచ్ఛం, శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.
- Advertisement -


