– ఇందిరమ్మ నమూనా ఆలస్యం
– ఇంకా ఎంపిక కానీ లబ్ధిదారులు
– నాలుగు నమునాల్లో ఏదో ఒకటికే అవకాశం
– ఇష్టం వచ్చినట్టు కట్టుకునేందుకు వీలులేదు
– పిల్లర్లు, భీమ్లు లేకుండా పలు నమూనాలు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
ఇందిరమ్మ ఇళ్ల పథకం మూడు అడుగుల ముందుకు.. ఏడడుగులు వెనక్కి అన్న చందంగా కొనసాగుతోంది. ఇంకా గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి కాలేదు. మండలానికి ఒక గ్రామంలో మాత్రమే లబ్ధిదారుల ఎంపిక చేసి చేతులు దులుపుకున్నారు. ఇంకా వారికి కూడా ఎలాంటి హక్కు పత్రాలు ఇవ్వలేదు. ఇండ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అంటే ఇంకా మార్గదర్శకాలే సిద్ధం కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ పథకానికి పిల్లర్లు, భీమ్లు లేకుండా పలు నమూనాలను సిద్ధం చేసింది. వాటిని అమలు చేయాలని చూస్తోంది. నాలుగు నమునాల్లో ఏదో ఒకటి లబ్ధిదారులు ఎంపిక చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. లబ్ధిదారులు తమకు ఇష్టం వచ్చినట్లు ఇల్లు నిర్మించుకోవడానికి అవకాశం లేదు. అయినా ఇంకా గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపికలో మీనమేషాలు లెక్కిస్తుంది. ఇదీలా ఉంటే మండల కేంద్రంలో మోడల్ ఇందిరమ్మ ఇంటి నిర్మాణం చేపడుతుంది. స్థానికల ఎమ్మెల్యేల చేతుల మీదుగా భూమి పూజ చేశారు. కానీ ఇంకా నిర్మాణం చేపట్టడంలో అధికారులు నిర్లక్షం వహిస్తున్నారు.
గోడలపై ఆర్సీసీ రాఫ్టర్లు అమర్చుతారు. వాటి మీద పూర్వకాలం తరహాలో బెంగళూరు పెంకులు పరుస్తారు. పెంకుల మీద రెండున్నర అంగుళాల మందంతో శ్లాబ్ వేస్తారు. ఈ విధానంతో ఇటుక, స్టీల్ వ్యయం తగ్గించొచ్చు.
షార్ట్ కాలమ్ ఇన్స్ట్రక్షన్..
నిర్మాణంలో మోడల్ ఇందిరమ్మ ఇళ్లు..