అసమానతల భారతం కోసం మితవాదుల పోరాటం

డా.బిబేక్‌ దేబ్రాయ్, ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలికి ప్రధానమైన వ్యక్తి. మరో విధంగా చెప్పాలంటే ఆయన అధికార కేంద్రాలకు చాలా దగ్గరగా ఉండే వ్యక్తి. ఇటీవల కాలంలో ఆగస్ట్‌ 15 నాడు ‘లైవ్‌ మింట్‌’ పత్రికకు రాసిన వ్యాసంలో ఆయన, ప్రస్తుత రాజ్యాంగం కొనసాగింపును ప్రశ్నిం చాడు. స్వాతంత్య్రం తరువాత ఆమోదించ బడిన రాజ్యాంగాన్ని అనేక పర్యాయాలు సవరించారు కాబట్టి ప్రస్తుతం కొనసాగుతున్న రాజ్యాంగం, అప్పటి రాజ్యాంగం ఒకటికాదు అనేది ఆయన ఉద్దేశ్యం. కార్యనిర్వాహక వర్గం (ఎగ్జిక్యూటివ్‌) రాజ్యాంగం మౌలిక నిర్మాణాన్ని మార్చకూడదని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కాబట్టి, ఈ రాజ్యాంగం కాలం కూడా మించిపోయింది కాబట్టి మనం ఒక కొత్త రాజ్యాంగాన్ని తయారు చేసు కోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయ పడ్డాడు. మరీ ముఖ్యంగా, ఈ రాజ్యాంగం వలసవాద వారసత్వాన్ని కలిగి ఉందనీ, ఈ రాజ్యాంగంలోని అనేక నిబంధనల్ని, ముఖ్యంగా సామ్యవాదం, లౌకికవాదం, న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ విలువల్ని ఆయన ప్రశ్నిస్తాడు. ఆర్థిక సలహా మండలి, దేబ్రారు వ్యక్తం చేసిన అభిప్రాయాలతో అధికారికంగా విభేదించింది కానీ, భారత రాజ్యాంగం పట్ల సందేహాలను వ్యక్తం చేయడం, దానిపట్ల ఉండే వ్యతిరేకతలను మాత్రం చాలా విజయవంతంగా లేవనెత్తారు.
ఈ రాజ్యాంగం వలస వారసత్వం కలిగి ఉందని, దీన్ని బ్రిటీష్‌ వారు తెచ్చిన ‘1935 భారత ప్రభుత్వ చట్టం’ ఆధారంగా ఏర్పాటు చేశారని, ఇది భారతీయ విలువలను ప్రతిబింబించడం లేదని, ఇప్పటికే హిందూ మితవాద నాయకులు, సిద్ధాంతకర్తలు నొక్కి వక్కాణి స్తున్నారు. ఈ రాజ్యాంగంతో మితవాద హిందూ జాతీయ వాదులు ఏ మాత్రం సౌకర్యవంతంగా లేరు. ఇది ‘1935 భారత ప్రభుత్వ చట్టం’ కొనసాగింపు కాదు. మూడు సంవత్సరాల పాటు ఎంతో జాగ్రత్తగా, సమగ్రంగా, లోతైన అవగాహనతో, సంపూ ర్ణంగా చర్చించి తయారు చేసిన తరువాతనే భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షుడు బీ.ఆర్‌.అంబేద్కర్‌ దీనిని ముందుకు తీసుకొనివచ్చాడు. రాజ్యాంగ పరిషత్‌ అధ్యక్షుడు డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌, ఇంకా అనేకమంది సభ్యులు, భారత ప్రజలు పాల్గొన్న వలసవాద వ్యతిరేక పోరాటంలో గుర్తింపు పొందిన వారే. ‘భారతదేశం ఒక దేశం’గా రూపొందడంలో ఈ వలసవాద వ్యతి రేక పోరాటం అత్యంత కీలకమైనది. బహుళత్వం, సమ్మిళిత భారత జాతీ యవాదం కోసం నిలబడిన వారికి పూర్తి భిన్నం గా, మతపరమైన జాతీ యవాదులు ఈ మహత్తర పోరాటా నికి దూరంగా ఉండడమే కాకుండా, ఈ ప్రజా ఉద్యమం నుంచి ఉద్భవించిన విలువలనూ వ్యతిరేకించారు.
రాజ్యాంగం అమలులోకి వచ్చిన పుడు, ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచార పత్రిక ‘ఆర్గనై జర్‌’ రాజ్యాంగాన్ని తిరస్కరించి, మను స్మృతిని రాజ్యాంగంగా అమల్లోకి తీసుకు రావాలని డిమాండ్‌ చేసింది. నవంబర్‌ 30, 1949 నాడు ఆర్గనైజర్‌ పత్రిక సంపా దకీయం ఇలా ఉంది: ”కానీ మన రాజ్యాం గంలో ప్రాచీన భారతదేశంలోని ప్రత్యేక రాజ్యాంగా భివృద్ధి గురించి ఎలాంటి ప్రస్తా వనలేదు. పర్షియాకు చెందిన సోలోన్‌ లేదా స్పరాటాకు చెందిన లైకర్గస్‌ కంటే చాలా ముందుగానే మనువు చట్టాలను రచిం చారు. నేటికి కూడా మను స్మృతిలో రచించ బడిన చట్టాలు, ప్రపంచంలో ప్రశంసలు పొందుతూ, సహజమైన విధేయత, సమాజంలో అంగీకారమైన నిబంధనల అనుగుణ్య తలను బయటకు తీస్తున్నాయి. కానీ మన రాజ్యాంగ పండితులకు ఇవేవీ దృష్టిలో లేవు”.
హిందూ మితవాదుల పెరుగుదలతో రాజ్యాంగం పట్ల వ్యతిరేకత, దానిపై కఠినత్వం పెరుగుదల కూడా ప్రారంభమైంది.1998లో అటల్‌ బిహారీ వాజపేయి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు, రాజ్యాంగాన్ని సమీక్షించడానికి వెంకటాచలయ్య కమిషన్‌ను నియ మించింది. కమిషన్‌పై వచ్చిన తీవ్రమైన వ్యతిరేకతతో, దానిని అమలు చేయడంలో బీజేపీ నాయకత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి నష్టం వాటిల్లింది.రాజ్యాంగంపై వ్యతిరేకత భిన్న మార్గాల్లో వ్యక్తమవుతునే ఉంది. ఆరె స్సెస్‌ సర్సంగ్‌ చాలక్‌గా కే.సుదర్శన్‌ నియమించ బడినపుడు, భారత రాజ్యాంగం పాశ్చాత్య విలువలపై ఆధారపడిందని, దాని స్థానంలో భారతీయ పవిత్ర గ్రంథాల (మనుస్మృతిని సూచిస్తూ) పై ఆధారపడిన రాజ్యాంగం రావాలని బహిరంగంగా ప్రకటన చేశాడు. ”మన రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చివేయడానికి ఏ మాత్రం సిగ్గుపడాల్సిన పని లేదు, ఇప్పటికే దానిని వందసార్లు మార్చారు” అని ఆయన పునరుద్ఘాటిం చాడు. ఫ్రాన్స్‌ నాలుగు సార్లు సవరణలు చేసిందని అన్నాడు. దీనికి పవిత్రత ఏమీలేదనీ, అసలు దేశంలో అనేక రుగ్మతలకు మూలకారణం ప్రస్తుత రాజ్యాంగ మేనని ఆయన వ్యాఖ్యానించాడు.
బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన వివిధ స్థాయిల నాయకులు ఇలాంటి ప్రకటనలు అదేపనిగా చేస్తు న్నారు. ఇటీవలి కాలంలో ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’గా ఏర్పడినప్పుడు, అనేకమంది మితవా దులు, ‘ఇండియా’ అనే పదం బ్రిటీష్‌ వారి సృష్టి అనే కారణంతో దానిని వ్యతిరేకించారు. బీజేపీకి చెందిన ఒక రాజ్యసభ ఎంపీ, నరేష్‌ బన్సాల్‌, ఈ ‘ఇండియా’ అనే పదం బానిసత్వానికి చిహ్నం కాబట్టి, రాజ్యాంగం లో ఆ పదం స్థానం ఎక్కడ అని ప్రశ్నించాడు.ఇది వారి మనసుల నిర్వలసీకరణ భావానికి సంబంధించింది కూడా. ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హౌసబాలే ఇలా వ్యాఖ్యానించాడు. ”యూరోసెంట్రిక్‌ భావాలు, విధానాలు, ఆచారాలు ఇంకా దశాబ్ధాలుగా మనను పాలిస్తూనే ఉన్నాయి. స్వాతంత్య్ర దేశం వారిని పూర్తిగా వదిలించుకోలేదు”.
రాజ్యాంగం పట్ల వ్యతిరేకత విషయంలో దేబ్రారు, ఆరెస్సెస్‌లు విలీనమయ్యాయి. ఆర్‌ఎస్‌ఎస్‌ గణాలు రాజ్యాంగం పాశ్చాత్య స్వభావంపైన ఎక్కువ దృష్టిని కేంద్రీకరిస్తుండగా, స్వేచ్ఛ, సమానత్వం, లౌకికవాదం లాంటి అంశాల విలువలపై ప్రశ్నిస్తూ, దేబ్రారు అసలు విషయాన్ని బయటపెట్టాడు. వలసవాద వారసత్వ వాదన, పాశ్చాత్య ఆసియా దేశాలకు చెందిన ‘ముస్లిం బ్రదర్‌హుడ్‌’ లాంటి సంస్థలకు సమానంగా ఉంటుంది. ఇవి పాశ్చాత్యమైనవి అనే కారణంతో స్వేచ్ఛ, సమా నత్వం విలువలను వారు వ్యతిరేకిస్తారు. దేబ్రారు, ప్రస్తుత పాలకవర్గానికి చెందిన వారు భిన్న లింగ, మతాలు, కులాల మధ్య సమానత్వం ఉండాలనే భావనతో కలత చెందారు.
రాజ్యాంగం – ప్రజాగ్రహం
వలస కాలంలో సమాజంలో కులం, లింగ శ్రేణీగత వ్యవస్థలు కేంద్ర బిందువుగా ఉండడం వల్ల, ఆర్‌ఎస్‌ఎస్‌ గణాలు మనుస్మృతిని ఒక స్వర్ణయుగంగా వర్ణిస్తున్నారు. కానీ వలస కాలంలోనే లింగ, కుల శ్రేణీగత వ్యవస్థలు వాటి పట్టును కోల్పోవడం మొద లైంది. ఈ కాలంలోనే కార్మికులు తమ సంఘాలను (నారాయణ్‌ మేఘాజీ లోఖాందే, కామ్రేడ్‌ సింగార్వేలు) ఏర్పరచుకోగలిగారు. ఈ కాలంలోనే పాలక వర్గాలు చేస్తున్న దోపిడీ గురించి, వాటిని వదిలించుకోవాల్సిన అవసరం గురించి భగత్‌సింగ్‌ స్పష్టంగా వివరించాడు. వీటిలో చాలా పోరాటాలకు (వలసపాలన కింద ఉంటూ, వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడుతూ) భారతీయులే నాయకత్వం వహించారు. వలస కాలాన్ని మంచి లేదా చెడు జరిగినకాలంగా చూడలేం, కానీ ఈ కాలంలో విచారకరమైన పరిస్థితులు ఉన్నాయి. వలస అధికారం మన సంపదను దోచుకొని పోవడంతో, వారు కూడా ”మను షులంతా (మహిళలు కూడా) సమానం” అని వ్యక్తీకరించే సంస్థలను తెరవాల్సి వచ్చింది. ఆర్‌ఎస్‌ఎస్‌ గణాలు, ప్రధానమంత్రి సలహా దారు, రాజ్యాంగాన్ని వదిలించుకోడానికి భిన్నమైన వాదనలను వినిపించ వచ్చు, కానీ సారంలో మాత్రం వారు, భగత్‌సింగ్‌ ప్రతిపాదించిన విలువలకు, సమానత్వానికి, అంబేద్కర్‌ ప్రారంభించిన పోరాటాలకు, ముఖ్యంగా జాతీయోద్యమానికి చాలా వ్యతిరేకంగా ఉంటారు.
1990ల వరకు, భారత రాజ్యాంగం ఆధారంగా, నెహ్రూ ఆధునీకరణ విధానాలతో దేశం సమానత్వ మార్గాన్ని అనుసరించే ప్రయత్నం చేసింది. ఇప్పుడు మనం తిరోగమన మార్గంలో ఉన్నట్లు కనపడుతుంది. దేవాలయాలు, గోవు అంశాలు ఆధిపత్యం చెలాయి స్తుంటే, ప్రాచీన విలువలు అంటే గతాన్ని గూర్చి బ్రాహ్మ ణుల వివరణలను (నాగరిక విలువలుగా) ఉపయోగిం చడం ద్వారా, ప్రపంచంలోనే మహత్తరమైన ప్రజా ఉద్యమం (భారత స్వాతంత్య్ర పోరాటం) ద్వారా సాధిం చిన విజయాలను బలహీనపరచడం ద్వారా అసమాన తల వైపు మార్గం ఏర్పాటు చేస్తున్నారు. భారత రాజ్యాం గానికి వ్యతిరేకత అంటే, మతం (బ్రాహ్మణ వాదం) ద్వారా పవిత్రమైనదిగా పరిగణించబడిన అసమా నతల (కులం, వర్గం, లింగ) యుగానికి దేశాన్ని నెట్టివే యడానికే ఈ వ్యతిరేకతను ఉపయోగించడం అవుతుంది.
(”ద వైర్‌ సౌజన్యంతో”)
అనువాదం: బోడపట్ల రవీందర్‌, 9848412451
రామ్‌ పునియానీ

Spread the love