వేములవాడ రాజన్న సన్నిధిలో మోడీ..

– కాంగ్రెస్, బీఆర్ఎస్ అవినీతి సిండికేట్ కుటుంబ పార్టీలు..
– త్రిబుల్ ఆర్ సినిమా రికార్డ్స్, డబుల్ ఆర్ టాక్స్ మించిపోయింది..
– పీవీనీ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా అవమానించింది..
– కాంగ్రెస్ పార్టీ మేడిన్ బ్రిటిష్,
– మోడీ బ్యాంక్ బ్యాలెన్స్ రూ.5 లక్షలు మాత్రమే.. బండి
– వేములవాడలో ప్రధాని నరేంద్ర మోడీ..
నవతెలంగాణ – వేములవాడ 
దక్షిణ కాశీ ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దేశ ప్రధాని నరేంద్ర మోడీ కిఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రాజన్నకు అతి ప్రీతిపాత్రమైన కోడిమొక్కులు చెల్లించుకుని, శ్రీ రాజరాజేశ్వరి, శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు అప్పల భీమశంకర శర్మ, శరత్ శర్మ తీర్థప్రసాదలిచి ఆశీర్వచనం గావించారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ అవినీతి సిండికేట్ కుటుంబ పార్టీలు అనిదేశ ప్రధాని మోడీ మండిపడ్డారు. బుధవారం వేములవాడలోని బీజేపీ నిర్వహించిన భారీ బహిరంగ సభకు నరేంద్ర మోడీ ముఖ్యఅతిథిగా విచ్చేసి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, అదిలాబాద్ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గోమస శ్రీనివాస్ అభ్యర్థుల పక్షాన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ బి ఆర్ఎస్, కాంగ్రెస్ రెండు ఒకటేనని ఆ రెండు పార్టీలు నానానికి బొమ్మ బరుసు లాంటివారని ఎద్దేవా చేశారు. ఆ రెండు పార్టీలను కలుపుతుంది అవినీతి అని మండిపడ్డారు, కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలో నుండి కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. బిజెపి దేశ రక్షణ చూస్తది, కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలు ఫ్యామిలీ ఫస్ట్ , అవినీతి అనేది ఆ రెండు పార్టీల కనిపించే ఉమ్మడి లక్షణం అని అన్నారు. కాంగ్రెస్ పై ఓటుకు నోటు ఆరోపణ చేసిన బిఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉండి ఏం చేయలేక పోయిందని, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కాలేశ్వరం ప్రాజెక్టు స్కాంపై బీఆర్ఎస్ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటమి ఖాయమని, బిఆర్ఎస్ పత్తా లేదన్నారు. ప్రజలు ఎన్డీఏ వైపు నిలుస్తున్నారన్నారు. గత లోకసభ ఎన్నికల్లో రెండుసార్లు ఓటేసి తనకు ప్రధానిగా అవకాశం ఇస్తే దేశానికి సేవ  చేస్తున్నానని అన్నారు,దేశ భద్రతే తమకు తొలి ప్రాధాన్యమని ఎన్డీఏ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు.పీవీ నరసింహారావు మరణిస్తే కనీసం పార్టీ తరపున చేయవలసిన మర్యాదలు చేయలేదని ఘోరంగా  అవమానించిన దరిద్రపు పార్టీ కాంగ్రెస్ అని, బిజెపి ప్రభుత్వం పీవీ నరసింహారావుకు భారతరత్నతో అరుదైన గౌరవం ఇచ్చి ఆయన టీవీ పెంచిన ఘనత బిజెపి దాని వెల్లడించారు.తెలంగాణలో డబుల్ ఆర్ ఆర్ టాక్స్ నడుస్తుంది.. వసుళ్లలో త్రిబుల్ ఆర్ సినిమాను ఆర్ ఆర్ టాక్స్ మించిపోయిందని, త్రిబుల్ ఆర్ సినిమా 1000 కోట్లు సాధిస్తే..  ఆర్ ఆర్ మాత్రం కొన్ని రోజుల్లోనే ఆ రికార్డును బ్రేక్ చేసిందని సెటర్లు వేశారు. ఆర్ ఆర్ నుండి తెలంగాణ బంధ విముక్తి కల్పించాలని కోరారు. అంబానీ, ఆదాని నిఇన్నాళ్లు విమర్శించిన కాంగ్రెస్ నేడు ఆపివేసిందని మరి వాళ్ళ దగ్గర నుండి కాంగ్రెస్ ఎంత డబ్బులు తీసుకుందని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ మేడిన్ బ్రిటిష్ – కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ 
బండి సంజయ్ మాట్లాడుతూ..అందరిలా మోడీకి ఆస్తిపాస్తులు లేవని ఆయనకు కుట్రలు కుతంత్రాలు తెలియని అన్నారు. మోడీ బ్యాంక్ బ్యాలెన్స్ కేవలం రూ.5 లక్షలు మాత్రమేనని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోడీ మేడిన్ భారత్..  మాజీ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఏ దేశమో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ మేడ్ ఇన్ బ్రిటిష్ కాదా ప్రశ్నించారు. మోడీ పక్కా లోకల్.. ఆరడుగుల బుల్లెట్ అని కొనియాడారు. రాష్ట్రానికి బిజెపి గాడిద గుడ్డు ఇచ్చిందని కాంగ్రెస్ ప్రచారం చేస్తుంది.. కానీ తెలంగాణ ప్రజలకు ఆ పార్టీ ఇచ్చింది గాడిద గుడ్డు అని ఎదురు కౌంటర్ వేశారు. రైతులకు రెండు లక్షలు రుణమాఫీ అని చెప్పి గాడిద గుడ్డు ఇచ్చారని ,మహిళలకు కాంగ్రెస్ ఇచ్చింది గాడిద గుడ్డే అని మండిపడ్డారు. ఆరు గ్యారెంటీ ల పేరుతో ప్రజలను మోసగించిన దొంగల బ్యాచ్ కాంగ్రెస్ అని తీవ్రస్థాయిలో విమర్శించారు. తెలంగాణకు దొంగల బ్యాచ్ కావాలో అభివృద్ధికి నిర్దర్శనమైన మోడీ కావాలో తెలుసుకోవాలని అన్నారు.
Spread the love