- Advertisement -
గాంగ్టక్ : సిక్కింలోని యువతతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫుట్బాల్ ఆడారు. రెండు రోజుల పర్యటన కోసం సిక్కిం చేరుకున్న మోడీ మంగళవారం ఉదయం గాంగ్టక్లో కొంత మంది యువతతో కలిసి ఫుట్బాల్ ఆడారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ ఫుట్బాల్ సెషన్ను ‘ఉత్తేజకరమైనది’గా అభివర్ణించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేశారు. ఈ రెండు రోజల పర్యటనలో సిక్కిం రాష్ట్రం ఏర్పడి 50 ఏండ్లు పూర్తయిన సందర్భంగా జరిగే వేడుక కార్యక్రమ ముగింపు వేడుకల్లో మోడీ పాల్గొననున్నారు. రూ. 4 వేల కోట్ల విలువైన పలు ప్రాజెక్టులు ప్రారంభించనున్నారు.
- Advertisement -



