- Advertisement -
చెన్నయ్ : మురుగప్ప గ్రూప్నకు చెందిన మోంట్రా ఎలక్ట్రిక్ రెండు కొత్త ఎలక్ట్రిక్ ట్రక్ వాహనాలు ఏవియేటర్ 350, ఏవియేటర్ 350 ఎల్ప్లస్ను ఆవిష్కరించింది. వీటి ప్రారంభ ధరను రూ.14.58 లక్షలుగా నిర్ణయించింది. 65 లక్షల కిలోమీటర్ల ఫ్లీట్ డేటా ఆధారంగా రూపొందించిన ఈ వాహనాలు లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గిస్తూ, వ్యాపారాల్లో కార్యాచరణ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతాయని ఎండీ జలజ్ గుప్తా ధీమా వ్యక్తం చేశారు.
- Advertisement -



