వాకర్స్ ను కలిసిన ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్.

– వాకర్స్ ను కలిసిన ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల 
నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ ఐటిఐ గ్రౌండ్లో ఆదివారం మార్నింగ్ వాకర్స్ ను బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ స్థానిక మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల తో కలిసి కలిశారు.మార్నింగ్ వాకింగ్ వచ్చిన వారందరినీ, ఆప్యాయంగా పలకరిస్తూ, వారి మంచి చెడు, అడిగి తెలుసుకున్నారు. అనంతం వారితోటి కాసేపు క్రీడల్లో పాల్గొని అనంతరం స్థానికి టిఫిన్ సెంటర్ లో అల్పాహారం తీసుకొని పక్కనే గల టీ స్టాల్ లో వచ్చిన ప్రజలతో కారు గుర్తుకి ఓటు వేసి వచ్చే పార్లమెంటు ఎలక్షన్లో తమకు మద్దతు ఇవ్వాలని, తదితరులను కోరారు.ఈ కార్యక్రమంలో నగర మేయర్ నీతు కిరణ్ గారు, సిర్ప రాజు, సుజిత్ సింగ్, సదానంద్, టగాండ్ల లింగం, ప్రవీణ్, మహేందర్, నీలగిరి రాజు, అనిల్ వాకర్స్ అసోషియేషన్ పృథ్వి రాజ్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
Spread the love