ఉచిత గొర్రెలను పంపిణి నీ ప్రారంభించిన ఎంపీపీ జల్లిపల్లి

నవతెలంగాణ – అశ్వారావుపేట : మండలంలోని గుర్రాల చెరువు లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాయితీ పై అందించే గొర్రెలను శాసన సభ్యులు మెచ్చా నాగేశ్వర రావు ఆదేశాల మేరకు ఆదివారం గొర్రె పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గుర్రాల చెరువు పంచాయతీ లో మొత్తం 17 యూనిట్ల గొర్రెల పంపిణీ జరుగుతుందని అన్నారు.ఒక్కొక్క యూనిట్ కి రూ.1 లక్షా 75 వేలు విలువ చేసే 21 గొర్రెలు  ఉంటాయని, వీటి నిమిత్తం లబ్ధిదారులు తమ ఖాతాలలో రూ.43,750 లు జమ చేసుకున్నారని మిగిలిన మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీతో చెల్లిస్తుంది అనీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కలపాల దుర్గయ్య,పశు వైద్యాధికారి డాక్టర్ స్వప్న, గొర్రెల సంగం అధ్యక్షుడు  వీర్రాజు, పశు సంవర్ధక శాఖ సిబ్బంది మదర్,బాబ్జి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love