త్రాగునీటి బోరు బావి పనులు ప్రారంభించిన ఎం.పి.పి

నవతెలంగాణ – అశ్వారావుపేట
మండలంలోని అచ్యుతాపురం పంచాయతీ లో శాసన సభ్యులు మెచ్చా నాగేశ్వర రావు ఆదేశానుసారం ఆదివారం త్రాగునీటి బోరు బావి ఏర్పాటుకు ఎం.పి.పి శ్రీరామ మూర్తి పనులు ప్రారంభించారు. ఈ పనులకు మండల పరిషత్ గ్రాంట్ నిధులు మంజూరు చేయడం జరిగిందని ఆయన తెలిపారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ శాసన సభ్యులు మెచ్చా నాగేశ్వరరావు కు సమస్య ఉందని తెలిపితే వెంటనే స్పందించి దానికి పరిష్కారం చూపడంలో ఆయనకు ఎవరూ సాటి రారు అనీ,మండలంలో ప్రతి గ్రామంలో అత్యధికంగా సీసీ రోడ్లు మంజూరు చేసి పనులని పూర్తి చేసిన ఘనత మెచ్చా సొంతం అనీ,అలాగే మంచి నీటి ఎద్దడి తీర్చడానికి ఇటీవల ముఖ్యమంత్రి కేసీఅర్ రూ.5 కోట్లు ప్రత్యేక నిధి కేటాయించారని,ఈ 5 కోట్లు తో పలు అభివృద్ది పనులను ప్రారంభించారని అన్నారు. కార్యక్రమంలో కొల్లు చంద్రం శేఖర్,సతీష్ రెడ్డి,బానోతు పద్మావతి తదితరులు పాల్గొన్నారు.
Spread the love