గ్రామపంచాయతీ కార్మికులకు కనీస వేతనాలు, మల్టీ పర్పస్ విధానం రద్దు చేసి పర్మినెంట్ చెయ్యాలి

– జేఏసీ నాయకుల డిమాండ్
నవతెలంగాణ కంటేశ్వర్
గ్రామపంచాయతీ కార్మికులకు జీవో నెంబర్ 60 ప్రకారం కనీస వేతనాలు మల్టీపర్పస్ విధానం రద్దు చేసి పర్మినెంట్ చేయాలని జేఏసీ నాయకుడు చేశారు. గ్రామపంచాయతి కార్మికుల వేతనాలు పెంచి పర్మినెంట్ కై జిల్లా కేంద్రంలో కార్మిక ప్రదర్శన. గ్రామపంచాయతీ కార్మికుల వేతనాలు పెంచి వెంటనే పర్మినెంట్ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం రాజీవ్ గాంధీ ఆడిటోరియం వద్ద కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాలో గ్రామపంచాయతి కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి దాసు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.జూన్ 17 తేదీన రాష్ట్ర పంచాయతీ కమిషనర్ని రాష్ట్ర జేఏసీ నాయకత్వం ఆధ్వర్యంలో కలిసి కార్మికుల సమస్యల్ని వివరించడం జరిగిందని దాసు తెలిపారు.రాష్ట్రంలో ఉన్న సుమారు 50 వేల కార్మికుల్ని వెంటనే క్రమబద్ధీకరించాలని, పిఎఫ్, ఈఎస్ఐ చట్టాలను వర్తింపజేయాలని వారు డిమాండ్ చేశారు. మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, ప్రమాద బీమా 10 లక్షలు పోస్ట్ ఆఫీసులో కట్టాలని వారు డిమాండ్ చేశారు. కార్మికుల అక్రమతొలగింపులు ఆపాలని, 60 పిఆర్సి ప్రకారం సఫాయి కార్మికులకు 15,600 వేతనం వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. మోడీ తెచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను అమలు చేయమని రాష్ట్రం అసెంబ్లీ తీర్మానం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ను వారు కోరారు. కార్మికులకు, బట్టలు, చెప్పులు నూనెలు, పరికరాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. పంచాయతీ కార్మికులు దళితులు నిరుపేదలు కనుక వారికి డబుల్ బెడ్రూం పథకంలో మొదటి ప్రాధాన్యత ఇచ్చి అండగా నిలవాలని వారు కోరారు. ప్రజారోగ్యం కోసం తపించి, శ్రమించి పనిచేసే కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, లేనిచో 2023 జులై 6 నుండి నిరవేదిక సమ్మెకు దిగవలసి వస్తుందని రాష్ట్ర జేఏసీ నిర్ణయించిందని వారు తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ కి జేఏసీ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. తెలంగాణ ప్రగశీల గ్రామపంచాయితివర్కర్స్ యూనియన్ (ఐఎఫ్టియు) ఎండి. ఖాజామొయినుద్దీన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జేపీ గంగాధర్, భానుచందర్, చొప్పరి గంగాధర్ సిఐటియు నాయకులు జంగం గంగాధర్, సాగర్, రాజేష్ గంగారాం, తదితరులు పాల్గొన్నారు. వర్షంలో ప్రదర్శన కు వచ్చిన కార్మికులందరికీ జేఏసీ తరఫున ధన్యవాదాలు తెలియజేశారు.
Spread the love