మృతుని కుటుంబాన్ని పరామర్శించిన మున్సిపల్ చైర్మన్

నవతెలంగాణ- జమ్మికుంట: జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని మోత్కులగూడెం గ్రామానికి చెందిన సీనియర్ రిపోర్టర్ ఏ బూసి సంపత్ తండ్రి ఏ బూసి రాజమల్లు గతం నాలుగు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా, శుక్రవారం మృతిని కుటుంబ సభ్యులను మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు పరామర్శించి, మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన వెంట కౌన్సిలర్ పొన్నగంటి సారంగం, ఏ బూసి కొమురయ్య, ఏ బూసి ఓదెలు, మొండయ్య, సంపత్, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
Spread the love