గేదె పొడవడంతో రైతు మృతి

నవతెలంగాణ-వీణవంక: ప్రమాదవశాత్తు ఓ రైతును గేదె పొడవడంతో రైతు మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని ఇప్పలపల్లి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. మండలంలోని ఇప్పలపల్లి గ్రామానికి చెందిన ముదిగంటి రాజిరెడ్డి (50) అనే రైతు తన కొట్టంలో కట్టేసిన గేదెకు గడ్డి వేసేందుకు దాని దగ్గరకు వెళ్లాడు. దీంతో అది బెదిరి ఆ రైతును పొడవడంతో ప్రమాదవశాత్తు పక్కకున్న బండలపై పడడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయన మృతి చెందాడు. రైతు మృతితో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

Spread the love