నవతెలంగాణ-పటాన్చెరు
80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో నిర్వహించిన జాతీయ మానవతా సదస్సు, అవార్డులు 2026లో రెండు ప్రతిష్టాత్మక పురస్కారాలను హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థిని మేఘనా రెడ్డి కొల్లి అందుకున్నారు. సుస్థిర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, సమాజ పరివర్తనకు కృషి చేసిన మేఘనకు ‘యంగ్ సోషల్ వర్కర్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారం ప్రదానం చేశారు. ఆమె సంస్థ, ఎంఆర్ ఫ్యూచర్ ఫౌండేషన్ (ఎం.ఆర్.ఎఫ్.ఎఫ్), ‘బెస్ట్ ఎన్జీవో ఆఫ్ ది ఇయర్- సస్టైనబుల్ సోషల్ ఇంపాక్ట్’ (సుస్థిర సామాజిక ప్రభావంలో ఈ ఏడాది మేటి స్వచ్ఛంద సంస్థ) పురస్కారంతో కూడా సత్కరించారు. భారత ప్రభుత్వ బొగ్గు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మినీరత్న ప్రభుత్వ రంగ సంస్థ అయిన సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎస్ఈసీఎల్) నిర్వహించిన ఈ సదస్సు, మానవతా సేవ, దేశ నిర్మాణానికి గణనీయమైన కృషి చేస్తున్న వ్యక్తులు, సంస్థలను గుర్తించింది.
గీతం నుంచి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ లో పట్టభద్రురాలై, ఐఐఎం నుంచి ఎంబీఏ పూర్తి చేసిన మేఘన, ఎం.ఆర్. ఫ్యూచర్ ఫౌండషన్కు చైర్మెన్, మేనేజింగ్ ట్రస్టీగా పనిచేస్తున్నారు. ఆమె నాయకత్వంలో, ఎం.ఆర్.ఎఫ్.ఎఫ్. ఆరోగ్య సంరక్షణ, విద్య, పర్యావరణ సుస్థిరత, సామాజిక న్యాయం, మానసిక ఆరోగ్యం, జీవనోపాధి ప్రోత్సహం, సామాజిక అభివృద్ధి రంగాలలో ప్రభావవంతమైన కార్యక్రమాలను చేపట్టారు. ప్రధాన మంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ కింద క్షయవ్యాధి పోషకాహార సహాయ కార్యక్రమంతో పాటు, గ్రామీణ ఆరోగ్య సంరక్షణ, అక్షరాస్యత, బలహీన వర్గాలకు మద్దతు ఇచ్చే కార్యక్రమాలు కూడా వీటి ముఖ్య కార్యక్రమాలలో ఉన్నాయి. ఈ రెండు జాతీయ పురస్కారాలు మేఘన వ్యక్తిగత నాయకత్వాన్ని, అలాగే ఎం.ఆర్.ఎఫ్.ఎఫ్. నిరంతర సామాజిక ప్రభావాన్ని గుర్తిస్తున్నాయి.
గీతం పూర్వ విద్యార్థినికి జాతీయ మానవతా పురస్కారాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



