జిల్లా జర్నలిస్ట్ యూనియన్ జిల్లా ఉపాద్యక్షులు లుగా నవీన్ రావు.

నవతెలంగాణ- తాడ్వాయి 
కామారెడ్డి జిల్లా తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్టు అసోసియేషన్ ఉపాధ్యక్షులుగా జాదవ్ నవీన్ రావు ఏకాగ్రీవంగా ఎన్నికయ్యారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆదివారం జిల్లా జర్నలిస్టు యూనియన్ ఎన్నికలు నిర్వహించారు. రాష్ట్ర కార్యదర్శి విరహత్ అలీ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. మండల కేంద్రానికి చెందిన  జర్నలిస్ట్ నవీన్ రావును ను జిల్లా జర్నలిస్టులు ఏకాగ్రీవంగా ఎన్నుకున్నారు .ఆయన ఎన్నిక కావడం పట్ల మండల తోటి జర్నలిస్టులు అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. తమపై నమ్మకంతో ఎన్నుకున్నా ప్రతి ఒక్కరికి ఎంతో రుణపడి ఉంటారని ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు నవీన్ రావు తెలిపారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
Spread the love