గోపీచంద్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. ఈ చిత్రాన్ని చిత్రాలయం స్టూడియోస్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా నిర్మాత వేణు దోనేపూడి నిర్మిస్తున్నారు. సూపర్స్టార్ కష్ణ ఆశీస్సులతో కొత్త ప్రొడక్షన్ బ్యానర్ చిత్రాలయం స్టూడియోస్ ప్రారంభమైంది. ఈ ప్రొడక్షన్ హౌస్ నుండి వస్తున్న మొదటి సినిమా ఇది. సినిమాలోని చాలా భాగం విదేశాల్లోని కొన్ని అద్భుతమైన లొకేషన్లలో చిత్రీకరించనున్నారు.
భారీ బడ్జెట్తో లావిష్గా రూపొందనున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో గ్రాండ్గా లాంచ్ అయింది. ముహూర్తం షాట్కు మైత్రి నవీన్ కెమెరా స్విచాన్ చేయగా, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు క్లాప్ కొట్టారు. శ్రీను వైట్ల స్వయంగా తొలి షాట్కి దర్శకత్వం వహించారు. రమేష్ ప్రసాద్, ఆదిశేషగిరిరావు, సురేష్ బాబుతోపాటు పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభం కానుంది. గోపీచంద్ హీరోగా నటిస్తున్న 32వ చిత్రమిది. ఇంతకు ముందు చేయని పూర్తి భిన్నమైన పాత్రలో గోపీచంద్ని చూపించడానికి ఒక హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ను దర్శకుడు శ్రీనువైట్ల రూపొందించనున్నారు. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: శ్రీను వైట్ల, స్క్రీన్ ప్లే: గోపీ మోహన్, సినిమాటోగ్రఫీ: కేవీ గుహన్, సంగీతం: చైతన్ భరద్వాజ్.