నవతెలంగాణ-హైదరాబాద్ : హాథ్రస్లో భోలే బాబా ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక సభలో తొక్కిసలాట జరిగి 121 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై కేసు నమోదు కాగా అందులో భోలే బాబా పేరును ప్రస్తావించలేదని తెలుస్తోంది. ఈవెంట్ ఆర్గనైజర్పై మాత్రమే పోలీసులు కేసు నమోదు చేశారట. సభకు 80వేల మందికి మాత్రమే అనుమతి ఇవ్వగా 2.5 లక్షల మందికిపైగా హాజరయ్యారని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నట్లు వార్తలు వస్తున్నాయి.