యూరియా కు కోరత లేదు..

– జెడిఎ ను సన్మానించిన ఐడిసిఎంఎస్ చైర్మన్ సాంబార్ మోహన్..
నవతెలంగాణ- డిచ్ పల్లి
ఇందల్మం లో మండలంలోని నల్లవెల్లి గ్రామంలో సహకార సొసైటీలో యూరియా నిలువలను జిల్లా వ్యవసాయ అధికారి వాజీద్ హుస్సేన్, నిజామాబాద్ రూరల్ సహాయ వ్యవసాయ సంచాలకులు పిండి. ప్రదీప్ కుమార్ కు బుధవారం ఆకస్మికంగా సందర్శించి వివరాలను సహకార సొసైటీ సిఈఓ తేజాగౌడ్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వాజిద్ హుస్సేన్ మాట్లాడుతూ యూరియా జిల్లాలో తగినంత నిల్వా ఉందని రైతులకు ఎలాంటి ఆందోళన చేందవల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈపిఓఎస్ క్లియర్ చేయాలని సొసైటీ కార్యదర్శికి తేజాగౌడ్ కు సూచించారు.నూతనంగా జిల్లా వ్యవసాయ అధికారిగా నియామకం పొందిన సహకార సొసైటీ కి వచ్చిన ఉమ్మడి జిల్లాల ఐడిసిఎంఎస్ చైర్మన్ సాంబార్ మోహన్ ఇరువురికి  శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ప్రవీణ్ కుమార్, వ్యవసాయ విస్తరణ అధికారులు శ్రీహరి, సతీష్, ప్రకాశ్ గౌడ్ సోసైటి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Spread the love