నవతెలంగాణ – సత్తుపల్లి : భూగర్భ జలాలు వేగంగా తగ్గిపోతున్న నేపథ్యంలో బోరుబావుల కింద వరి సాగును పూర్తిగా నివారించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ నుంచి వర్షాభావం తీవ్రత పెరిగే అవకాశం ఉందని, ఎల్ నినో ప్రభావం యాసంగి వరకు కొనసాగవచ్చని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలోని 23 జిల్లాల్లో ఇప్పటికే లోటు వర్షపాతం నమోదైందని మంత్రి తుమ్మల తెలిపారు. ప్రాజెక్టుల్లోని నీరు కేవలం తాగునీటి అవసరాలకే సరిపోతుందని స్పష్టం చేశారు. వరి, పత్తి పంటలకు బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు రైతులను ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ అధికారులకు మంత్రి సూచించారు. పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు మరియు ఉద్యాన పంటల సాగును విస్తృతంగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
బోరుబావుల కింద వరి సాగు వద్దు: మంత్రి తుమ్మల
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



