రేపు సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండి జహంగీర్ నామినేషన్

– రైల్వే స్టేషన్ నుండి ఏ ఆర్ గార్డెన్ వరకు భారీ ర్యాలీ

– 5000 మంది ప్రజా సమీకరణ
– అంబేద్కర్ చౌరస్తా వద్ద రోడ్ షో
– ఏ ఆర్ గార్డెన్ లో సభ
– హాజరుకానున్న సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు
– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
– వేలాదిగా తరలిరండి: చెరుపల్లి సీతారాములు కేంద్ర కమిటీ సభ్యులు
నవతెలంగాణ – భువనగిరి
భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండి జహంగీర్ ఏప్రిల్ 19న శుక్రవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చెయ్యనున్నారని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం పార్టీ ఇంచార్జ్ చెరుపల్లి సీతారాములు తెలిపారు. గురువారం ఆయన నవతెలంగాణ తో మాట్లాడారు.  అభ్యర్థి ఎండి జహంగీర్ నామినేషన్ సందర్భంగా ఉదయము 10 గంటలకు భువనగిరి పట్టణంలోని రైల్వే స్టేషన్ నుండి ఏ ఆర్ గార్డెన్ వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు. భువనగిరి అంబేద్కర్ చౌరస్తా వద్ద రోడ్ షో, అనంతరం ఏ ఆర్ గార్డెన్ లో నామినేషన్ సభ ఏర్పాటు చేశామన్నారు. నామినేషన్ సందర్భంగా నిర్వహించే రోడ్ షోకు సభకు సీపీఐ(ఎం) పొలిటి బ్యూరో సభ్యులు బివి రాఘవులు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతోపాటు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు హాజరుకానున్నట్లు తెలిపారు. సభ ర్యాలీ సుమారు 5000 మందితో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ర్యాలీ విజయవంతం కోసము జన సమీకరణ, రోడ్ షో, మంచినీటి సౌకర్యం, సభ ఏర్పాట్లుపై ప్రత్యేక కమిటీలు వేశామని తెలిపారు.  ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా  కవరేజ్ కు రావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ యొక్క  ప్రజలు స్వచ్ఛందంగా ర్యాలీ లో పాల్గొని రోడ్ షో సభను విజయవంతం చేయాలని సీతారాములు విజ్ఞప్తి చేశారు.
Spread the love