ఇష్టంగా చేసే పని ఏదీ కష్టంగా ఉండదు…

Oplus_131072
  • ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సన్మానించిన ఎంపీపీ జల్లిపల్లి
    నవతెలంగాణ – అశ్వారావుపేట: ఇష్టంగా చేసే పని ఏది కష్టంగా ఉండదని,నిరంతరం శ్రమ ద్వారానే ఉత్తమ ఫలితాలు సంభవిస్తాయని ఎంపీపీ జల్లి పల్లి శ్రీరామమూర్తి అన్నారు. శుక్రవారం పదవ తరగతిలో 10/10 మార్కులు సాధించిన మండలంలోని జవహర్,సూర్య,గౌతమి పాఠశాలలకు చెందిన విద్యార్ధులు కే.పల్లవి,సీమా కౌర్,ప్రితిక ప్రిన్సెస్ తండ్రులు నారాయణరావు, కలీల్ భాషా,శ్యామ్ లను,ప్రధానోపాధ్యాయులు ను శాలువాతో సత్కరించి మెమెంటో అందజేసారు. అ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచి గా చదివి తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు తేవాలని విద్యార్థులను కోరుతూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు సంక ప్రసాద్, జిల్లా బీఆర్ఎస్ అధికార ప్రతినిధి యు.ఎస్ ప్రకాష్ రావు, శెట్టిపల్లి రఘురామ్, జుజ్జూరపు శ్రీరామమూర్తి, ప్రధానోపాధ్యాయులు ప్రవీణ్,రాంబాబు,చలపతి రావు,తదితరులు పాల్గొన్నారు.
Spread the love