శిధిలావస్థకు చేరిన బస్టాండ్ పరిశీలన..

నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో గల శిధిలావస్థకు చేరిన బస్టాండ్ ను శనివారం రోజు జడ్పిటిసి సభ్యుడు మనోహర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత కొన్ని నెలలుగా మండల కేంద్రంలో గల బస్టాండ్ శిధిలావస్థకు చేరిన సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవడంలేదని బస్టాండ్ శిథిలావస్థకు చేరడంతో ప్రయాణికులు బస్టాండ్ లోకి రాలేకపోతున్నారని అదేవిధంగా బస్సులు కూడా బస్టాండ్ లోనికి రావడం లేదని రోడ్డుపైనే నిలబడి వెళ్ళిపోతున్నాయని ఆయన పేర్కొన్నారు. బస్టాండ్ ప్రాంగణంలో ఉండాల్సిన బస్సులు రోడ్డుపైనే నిలుస్తున్నాయని బస్టాండ్ లోకి బస్సులు రాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు బస్టాండ్ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన షెడ్డు రోడ్డుకు అడ్డంగా ఉందని ఆయన అన్నారు. ఈ విషయంపై బాన్సువాడ డిపో మేనేజర్  ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. సంబంధిత అధికారులు స్పందించి నూతన బస్టాండ్ నిర్మించాలని ఆయన పేరు కొన్నారు.
Spread the love