- Advertisement -
నవతెలంగాణ – రెంజల్ : రెంజల్ మండలం కళ్యాపూర్ గ్రామంలో గత 24 గంటలుగా కురుస్తున్న వర్షాలకు రెండు ఇండ్లు కూలిపోవడంతో వారికి తాత్కాలిక ఆశ్రయం కల్పించడానికి సర్పంచ్ రెమ్మ భానుచందర్ తహసిల్దార్ శ్రావణ్ కుమార్ కు సమాచారం అందించారు. ఆయన వెంటనే స్పందించి ఆ రెండు కుటుంబాలు గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్ రూములలో తాత్కాలిక ఆశ్రయం కల్పించాలని కోరగా, స్పందించి వారికి ఆశ్రయం కల్పించాలని సర్పంచ్ పేర్కొన్నారు. బాధితులకు ఎలాంటి సమస్యలు ఎదురైన గ్రామ కార్యదర్శి నవీన్ దగ్గరుండి చూసుకోవాలని తహసిల్దార్ శ్రావణ్ కుమార్ ఆదేశించారు. వారికి ప్రభుత్వం నుండి ఆర్థిక సాయం అందించడానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
- Advertisement -



