చెన్నై పోర్టులో ఆయిల్‌ ట్యాంకర్‌.. ఒకరు మృతి

నవతెలంగాణ – చెన్నై :   చెన్నై నౌకాశ్రయంలో శుక్రవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ఓ నౌకలోని ఆయిల్‌ ట్యాంకర్‌కి మరమ్మత్తులు నిర్వహిస్తుండగా ఒక్కసారిగా పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, ముగ్గురికి తీవ్రగాయాలైనట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించామని అన్నారు. ఈ నౌక మరమ్మత్తుల కోసం ఒడిశా నుండి అక్టోబర్‌ 30న చెన్నై నౌకాశ్రయానికి చేరుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హార్బర్‌ పోలీసులు తెలిపారు.

Spread the love