ట్రాక్టర్ ఢీ.. ఒకరు మృతి..

– మరికరి పరిస్థితి విషమం

– మృతునిది నాగార్జున సాగర్ గా గుర్తింవు

– ట్రాక్టర్ ను, డ్రైవర్ ను అదువులోకి తీసుకున్న పోలీసులు

నవతెలంగాణ -పెద్దవూర నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలం నాయిన వాని కుంట స్టేజీ వద్ద.. బైకును ట్రాక్టర్.. ఢీ కొట్టిన సంఘటన లో ఒకరు మృతిచెందగా, మరొకరికి తీవ్ర గాయాలు గాయలైన సంఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల ప్రకారం నాగార్జున సాగర్ కు చెందున ఇద్దరు వ్యక్తులు బైకుపై వెళుతుండగా మండలం లోని నాయిన వాని కుంట స్టేజీ వద్ద ట్రాక్టర్ బైకు ను ఢీ కొట్టింది. ఈసంఘటన లో బైకు పై వున్న ఒక వ్యక్తి తలకు తీవ్ర గాయాలు కావడం తో అక్కడికక్కడే మృతి చెందారు. బైకు పై వున్న మరిక వ్యక్తికి తీవ్ర గాయాలు కావడం తో అతని పరిస్థితి విషమంగా వుంది. సంఘటన స్టలానికి చేరుకున్న పోలీసులు ట్రాక్టర్ డ్రైవర్ ను, మరియు ట్రాక్టర్ ను అదుపులో కి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.మృతి వ్యక్తిని సాగర్ కమలనెహ్రు ఆసుపత్రికి పోస్టు మార్టం నిమిత్తం తరలించారు‌. మృతి చెందిన వ్యక్తి, గాయాలైన వ్యక్తి నాగార్జున సాగర్ కు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు వివరాలు తెలియాలసి వుంది. మృతి చెందిన వ్యక్తిని పోస్టు మార్టం నిమిత్తం సాగర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Spread the love